
*గౌరవ సలహాదారులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్ర కళాకారుల సంఘం కన్వీనర్ యెల్ల పోశెట్టి*
వేములవాడ సంబంధించిన ప్యానల్ వారీగా జరిగిన ఎన్నికలలో 2 సంవత్సరాల కాల పరిమితి జోన్ 3గా ఎన్నికలలో యెల్ల పోశెట్టి తండ్రి తుకారాం ను గౌరవ సలహాదారులు గా ఏకగ్రీవంగా పద్మశాలి కులబంధావులు ఎన్నుకోవడం జరిగింది, ఈసందర్బంగా ఎన్నికల అధికారి బూర సదానందం ధృవీకరణ పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో నూతన పాలకవర్గం సభ్యులకు సన్మానం చేసి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు.వేములవాడ పద్మశాలి సంఘం నూతన అధ్యక్షుడు రాంపల్లి వెంకట రమణ పాలక వర్గం సబ్యులు 25 వార్డు కౌన్సిలర్ కోక్కుల బాలకృష్ణ.5 వ వార్డు కౌన్సిలర్ వాసాల లావణ్య శ్రీనివాస్ పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.
